
రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ తెలుగు నాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రం తమిళ అనువాద హక్కులను కలైపులి థాను సొంతం చేసుకున్నారు. ‘మగధీర’లో సునీల్ చేసిన పాత్రను అక్కడ వడివేలుతో రీషూట్ చేశారు. కాగా..తన సినిమాలకు మాత్రమే మాటలు రాసే భాగ్యరాజా ఈ చిత్రానికి మాటలు అందించారు. వాలి పాటలు రాశారు. తమిళంలో ఈ చిత్రానికి ‘మన్నాది మన్నన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ‘రోబో’ విడుదల కూడా త్వరలోనే ఉన్నందున ‘మన్నాది మన్నన్’ విడుదలను వాయిదా వేస్తే, ఆ తర్వాత పోటీ లేకుండా సోలోగా తమిళనాడుని ఎటాక్ చెయ్యొచ్చని అల్లు శిరీష్ అంటున్నాడు. రోబో, మన్నాది మన్నన్ ఒకేసారి రిలీజ్ అయితే రోబోనే చూస్తారు కానీ ఈ సినిమాని చూడరు కదా. అందుకే రజనీకాంత్ తో పోటీపడటం ఇష్టం లేక అల్లు శిరీష్ ‘మన్నాది మన్నన్’ని వాయిదా వేస్తే మంచిదంటున్నాడేమో
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి